వరంగల్ : కరోనా సమయంలో అప్పు తెచ్చి మరీ పెన్షన్లు ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలం కేంద్రంలో కొత్త గా మంజూరు అయిన పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.
పెండ్లిళ్లు చేసి పేద తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదని పేదింటి ఆడబిడ్డలకు మేనమామ గా మారి కల్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇలా ప్రతి ఒక్కరి కోసం సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని ప్రతి పల్లె బాగు పడింది. ఒక ప్రణాళికతో సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. మనమంతా సీఎం కేసీఆర్కు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు ఉన్నారు.