హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను ఒక్కోచోట ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారని మంత్రి పేర్కొన్నారు. దసరా రోజున పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకును బంగారంలా పరస్పరం పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని మంత్రి చెప్పారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని, అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు పొందిందని అన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ గా మారిందని చెప్పారు. విజయాలు సాధిస్తూ, సీఎం కేసీఆర్ కుటుంబం సహా, రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు.