హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ అని ఆయన పేర్కొన్నారు. మనషుల పట్ల కరుణతో ఉండాలని, సర్వ ప్రాణులను ప్రేమించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని మతాలను సీఎం కేసీఆర్ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని పండుగలను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తున్నదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షా 95 వేల మందికి క్రిస్మస్ బట్టలను కానుకగా ప్రభుత్వం అందజేసింది అని తెలిపారు. కరోనా నుండి మనల్ని రక్షించాలని ఏసు ప్రభువును కోరుకుంటున్నాను అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.