చండూరు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు (అక్టోబర్ 30) చండూరు మండలం బంగారు గడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మునుగోడు ఓటర్లను సీఎం కోరనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించారు.
సీఎం బహిరంగసభ ఇన్చార్జి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి సభా ప్రాంగణం అంతా తిరిగి చూశారు. ఈ సందర్భంగా మంత్రి వెంబడి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, సీనియర్ నాయకులు కిషన్ రావు తదితర టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.