హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం (Annavaram) శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) దర్శించుకున్నారు. గురువారం ఉదయం సతీసమేతంగా అన్నవరం ఆలయానికి చేరుకున్న మంత్రి ఎర్రబెల్లి.. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని ఆయల పండింతులు స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీ విజయం సాధించాలని కోరుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం, ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.