హైదరాబాద్: దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంటరాని తనాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త అని చెప్పారు. అంబేద్కర్ కేవలం దళితుడు కాదని, అందరివాడని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత 131వ జయంతి సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని చెప్పారు.
అంబేద్కర్ తర్వాత దేశంలో దళితుల గురించి ఆలోచించిన నేత సీఎం కేసీఆర్ మాత్రమేనని, దళితుల ఆత్మ బంధువు అని వెల్లడించారు. దళితుల సాధికారత కోసం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. వారి అభివృద్ధికోసం ప్రత్యేక చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను ఏర్పాటు చేశామని తెలిపారు. దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాచేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి ద్వారా విదేశాల్లో చదువుకునేవాళ్ల కోసం ఒక్కొక్కరికి రూ.20 లక్షలు సహాయం అందిస్తున్నామన్నారు. బడ్జెట్లో రూ.17 వేల 700 కోట్లు కేటాయించామని వెల్లడించారు.