జనగామ: దేశంలోనే అత్యంత ప్రజాదరణ, అత్యధిక సభ్వత్వాలు కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భవిష్యత్తు, ప్రజల అభిమానం లేని ప్రతిపక్షలతో ఒరిగేదేమీ లేదన్నారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కడవెండిలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పార్టీలకు రాజీనామా చేసి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చినవారికు మంచి భవిష్యత్తు ఉంటుందని, తగిన గుర్తింపు దక్కుతుందని హామీఇచ్చారు.