వరంగల్ : టీఆర్ఎస్ విజయగర్జన సభ కోసం రాంపూర్ సమీపంలోని స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించేందుకు పార్టీ భారీ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలో మడికొండ, ఉనికిచర్ల, ఉర్సు రంగలీలా మైదానం సమీపంలోని పలు ప్రాంతాలను మంత్రి పరిశీలించిన మంత్రి.. తాజాగా వినోద్ కుమార్తో కలిసి రాంపూర్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు.
అక్కడి రైతులతోనూ మాట్లాడారు. కాగా, టీఆర్ఎస్ విజయగర్జన సభను 10లక్షల మందితో విజయవంతం చేయడానికి, ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.