హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణను పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అల్లం నారాయణ ఇంటికి వెళ్లి.. అల్లం పద్మ చిత్రపటం వద్ద మంత్రి ఎర్రబెల్లి పుష్పాంజలి ఘటించి ఆమెకు నివాళులర్పించారు. అనంతరం.. అల్లం నారాయణ, కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.