చండూరు అక్టోబర్ 10 : రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మునుగోడులో ఆ పార్టీని ఓడించి గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. చండూరు 2, 3 వార్డులకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మంత్రి సోమవారం ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
రాజగోపాల్రెడ్డి స్వార్థంతో వచ్చిన ఈ ఎన్నికలో ఆయనకు డిపాజిట్ రాకుండా చేయాలని చెప్పారు. మునుగోడు అభివృద్ధి కావాలన్నా, ఇక్కడి ప్రజలకు మంచిరోజులు రావాలన్నా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని పేర్కొన్నారు. చండూరులోని 2,3 వార్డులను దత్తత తీసుకుంటున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు.