హైదరాబాద్ : హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, మహిళా రైతుల సాధికారతకు ఆధ్యుడు, అధిక దిగుబడులు ఇచ్చే అనేక వరి వంగడాలను కనుగొన్న రైతు బాంధవుడు ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
దేశంలో పంటల సమృద్ది, ఆహార అభివృద్ధి, భద్రత, మహిళా రైతుల స్వయం సమృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. అయన మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటు, జీవితాంతం వ్యవసాయ అభివృద్ధి గురించే ఆలోచించిన ఆయన సేవలు అనితర సాధ్యం. అయన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి. అయన అనేక సూచనలను సీఎం కేసీఆర్ పాటిస్తూ, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేశారన్నారు.