చండూరు: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం పట్టణానికి చెందిన టీ ప్రకాష్ జన చైతన్య సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే మూడు మండలాల్లో ఆయన తన సైకిల్పై పర్యటించారు. ఇవాళ చండూరులో ఆయన జనచైతన్య సైకిల్ యాత్ర సాగుతున్నది. ఈ సందర్భంగా చండూరులో మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి.. టీ ప్రకాష్ను పలకరించి అభినందించారు.
ప్రజలను చైతన్య పరచడానికి టీ ప్రకాష్ కొంతకాలంగా చేస్తున్న సైకిల్ యాత్రా ప్రయత్నం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల ఎంతో ప్రేమ ఉన్నదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని మంత్రి పేర్కొన్నారు.