తొర్రూరు, నవంబర్ 8: చేతులెత్తి మొక్కి చెబుతున్నా.. యాసంగిలో వరికి బదులు అధిక లాభా లు వచ్చే పంటలు సాగు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమా ణ స్వీకారోత్సవం, అమ్మాపురంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ ప్రాంత రైతులను గోస పెడుతున్నదన్నారు. యాసంగి ధాన్యాన్ని సేకరించేదిలేదని ఎఫ్సీఐ స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు వరి సాగు వైపు వెళ్లొద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.