జనగామ : రాజారాం గ్రామంలో కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్తూర్బా విద్యార్థులకు ఇటీవల కొత్త భవనం అందుబాటులోకి రాగా.. విద్యార్థులకు భవనంలోకి తరలించారు. ఈ నేపథ్యంలో విద్యాలయాన్ని సందర్శించారు. వసతులు, వంట తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించి, బోధనపై ఆరా తీశారు. వంటశాలకు వెళ్లి వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడగా.. సీసీ కెమెరాలు, ప్రహరీ, ల్యాబ్ వసతులు కల్పించాలని మంత్రిని కోరారు. ఈ మేరకు ఆయా వసతుల కల్పనకు మంత్రి హామీ ఇచ్చారు.