హనుమకొండ : దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవి కాలంలోపు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పురోగతిపై నేడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్యాకేజీ కింద నాలుగు జిల్లాలు వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు వస్తాయని తెలిపారు. గతంలో గతంలో కాంట్రాక్టర్ చేయకపోతే సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి రీ టెండర్ పిలిపించామని, అనుకున్నంత ముందుకు సాగడం లేదన్నారు.
లోపాలు దిద్దుకొని వేసవిలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆరు నెల్లల్లో పూర్తి చేస్తామని హామీ ఇస్తే మూడేళ్లవుతున్నా పనులు పూర్తికావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పనులపై సమీక్ష నిర్వహిస్తారని, హైదరాబాద్లో రివ్యూ అయ్యేలోపు అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. అందరూ సమన్వయం చేసుకొని పనులు వేగంగవంతం చేయాలన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, జనగామ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, డాక్టర్ గోపి, శివలింగయ్య, చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.