వరంగల్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఎంతో గొప్ప చరిత్ర ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నిజాకాలంలో 1923లో అప్పటి హైదరాబాద్ ఏడో నిజాం రాజు ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్’ జాగీర్దార్ కళాశాల పేరుతో ఏర్పాటైందన్నారు. త్వరలో వంద సంవత్సరాలు పూర్తిచేసుకోబోతున్న దేశంలో అతిప్రాచీనమైన పాఠశాలగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. ఎందరో గొప్ప విద్యార్థులను అంగించిందన్నారు. వరంగల్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నాల్గో వార్షిక క్రీడా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సత్యా నాదెళ్ల, ఏపీ సీఎం జగన్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, అసదుద్దీన్ ఓవైసీ, సినీ నటుడు నాగార్జున, రాంచరణ్, హర్షా భోగ్లే, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్లాంటివారు ఎందరో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. బేగంపేట్ స్కూలో చదివి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి ప్రెసిడెంట్గా పని చేస్తున్న గుస్తీ జెనోరియ లాంటి వారిని అందించిన గొప్ప విద్యా సంస్థ అన్నారు.
బేగంపేట్, రామంతాపూర్, కడపలతో పాటు వరంగల్లో స్కూల్ ఏర్పాటు అయితే ఎంతో బాగుంటుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సొసైటీ వారితో చర్చించి 2016 సంవత్సరంలో మడికొండలో ప్రారంభించిందన్నారు. రాబోయే సంవత్సరాలలో అద్బుతమైన ఏర్పాట్లతో స్కూల్ నిర్మాణ ఏర్పాట్లు జరగబోతున్నాయి. ఇక్కడ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ రూ.7,800కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యనందించేందుకు కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ గుస్తీ జెనోరియా, వైస్ చైర్మన్ రఘురామ్ రెడ్డి అధికారిక కార్యదర్శి అప్నేందర్ బాబు, ప్రిన్సిపాల్ సరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు హెచ్పీఎస్లో నిర్వహించిన వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు.