Bonalu Festival | పాలకుర్తి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి ఎస్సీకాలనీలో జరిగిన పోచమ్మ బోనాల వేడుకల్లో మంత్రి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి మంత్రి బోనం ఎత్తుకున్నారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రినయ్యానన్నారు.
అమ్మవారి చల్లనిచూపుతో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చెందిందని, పాలకుర్తికి చారిత్రక, ఉద్యమ, సాహిత్య చరిత్ర ఉందన్నారు. సమైక్య పాలనలో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక టూరిజం కారిడార్ పనులు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే పాలకుర్తి సోమన్న, గ్రామదేవతల ఆశీసులతోనేనన్నారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలని, సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని మంత్రి పిలుపునిచ్చారు.