Minister Dayakar Rao | పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నిలిపింది మనమేనని మంత్రి దయాకర్రావు అన్నారు. పర్వతగిరిలో తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో చిల్లర రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, ప్రజలకు వారి చిల్లర చేష్టలను వివరించాలన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయం, పరస్పర సహకారంతో పని చేయాలని దయాకర్రావు సూచించారు.
త్వరలోనే ఎన్నికల కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి సీఎం కేసీఆర్కు కానుక ఇద్దామన్నారు. ప్రతి మండలానికి ఓ అభివృద్ధి కమిటీ వేసుకొని మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ సందర్భంగా రాయపర్తి కమిటీ చైర్మన్గా బిల్లా సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్గా బిల్లా సుధీర్ రెడ్డి నియమించి.. సన్మానించారు. అనంతరం శివరామపురం గ్రామానికి చెందిన మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్కు సీఎంఆర్ఎఫ్ చెక్కును మంత్రి అందజేశారు.