హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఢిల్లీలో జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, టీవీసీసీ, కుడా చైర్మన్లు వాసుదేవరెడ్డి, సుందర్ రాజ్ యాదవ్, ఉమ్మడి ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు చేసేదాకా కేంద్రాన్ని వదిలేది లేదన్నారు. రైతులకు అన్యాయం చేయడానికి చూస్తే ఎవరిని వదలమని, రైతన్న కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఉద్యమాలు చేశామని, రైతు బాగు కోసం పల్లె నుంచి ఢిల్లీకి వెళ్తున్నామన్నారు. రేపటి ధర్నాతోనైనా కేంద్రం దిగివస్తుందని ఆశిస్తున్నామన్నారు.