హైదరాబాద్ : పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఎంగిలిపూలతో బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పండగని ఆనందోత్సాహాల మధ్య జాగ్రత్తలతో జరుపుకోవాలని మంత్రి సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. తొమ్మిది రోజుల పాటు వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు.