హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం సేవలు మరువలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లు స్వరాజ్యం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటం, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.