హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ దవాఖానల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం సచివాలయంలో వైద్యారోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బడ్జెట్ అంచనాల రూపకల్పనపై వైద్యారోగ్య శాఖ మం త్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన సమీక్షించా రు.
ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాఖ పనితీరు, కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల పథకాలను వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచామని గుర్తుచేశారు.