హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా గ్రూప్ -1 అధికారులను నియమించాలని తెలంగాణ గ్రూప్ -1 అధికారుల సంఘం మంత్రి కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేసింది. గ్రూప్ -1 అధికారులతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్శాఖల అధికారులను నియమించాలని కోరింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్నాయక్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం సోమవారం ప్రగతిభవన్లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ను కలిసి పలు అంశాలపై చర్చించింది. అన్నిశాఖల్లో పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకొన్నందుకు మంత్రికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. నాన్ రెవెన్యూ కోటాలో ఖాళీగా ఉన్న 5 ఐఏఎస్ పోస్టులను భర్తీచేయాలని కోరారు. అన్ని శాఖల్లో అనుభవజ్ఞులైన అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ఏర్పాటు చేయాలని చంద్రశేఖర్గౌడ్ కోరగా, ఆయా అంశాలపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. మంత్రులను కలిసినవారిలో సంఘం నేతలు అరవిందరెడ్డి, హరికిషన్, అంజన్రావు, శశిధరాచారి, నాగరాజు, రమేశ్, పద్మజారాణి, ప్రశాంతి, రజనీకాంత్రెడ్డి, అమర్నాయక్ ఉన్నారు.