హైదరాబాద్, జూలై 21 : కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ఆయన భార్య రేవతిని మంత్రి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. వేణుగోపాలాచారి అత్త విజయమ్మ, మామ సింహాచారి అకాల మరణం పట్ల వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం బోయినపల్లిలో ఉన్న వేణుగోపాల చారి నివాసానికి వెళ్లి మంత్రి అల్లోల సంతాపం ప్రకటించారు.