వ్యవసాయానికి పెట్టింది పేరైన నిర్మల్ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో బోర్లే జీవనాధారం. పక్కనే గోదావరి, స్వర్ణ, గడ్డెన్న-వాగులున్నా.. సాగునీరు అందని దుస్థితి. బీఆర్ఎస్ పాలనలో, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సారథ్యంలో నిర్మల్ ప్రగతి పథంలో పయనిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతుండగా.. ఇప్పటికే మిషన్ కాకతీయ ఫలితాలు అందుతున్నాయి. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతో కరెంటు కోతలకు చెక్ పడింది.
1952 సంవత్సరం నుంచి నిర్మల్ నియోజకవర్గ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం నూతన జిల్లాలు ఏర్పాటు చేయడంతో నిర్మల్ నియోజకవర్గం జిల్లా కేంద్రమయ్యింది. నర్సాపూర్(జి), నిర్మల్ అర్బన్, సోన్, కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఇటీవల పొన్కల్, బీరవెల్లిలను నూతన మండలాల జాబితాలో చేర్చారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావుపై బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2018లో బీఆర్ఎస్ నుంచి రెండో సారి విజయం సాధించారు. నిర్మల్ పట్టణం, నియోజకవర్గం, నిర్మల్ జిల్లాను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. పట్టణంలో సభలు, సమావేశాల నిర్వహణ కోసం రెండు వేల మంది ప్రజలు కూర్చునేందుకు వీలుగా రూ.5 కోట్లతో బీఆర్ అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు. రూ. కోటితో మత్స్య శాఖ భవనం, రూ.5 కోట్లతో ముస్లింలకు చించోలిలో ఈద్గా ప్రార్థన మందిరం, ఆర్అండ్బీ ద్వారా రూ. 194 కోట్లతో 313 కిలో మీటర్ల మేర రహదారులు, రూ.94 కోట్లతో 25 వంతెనలు నిర్మించారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 13 పనులకు రూ.1,062.29 కోట్లు ఖర్చు చేశారు. సోన్ మండలంలోని బొప్పారంలో రూ.1,160 కోట్లతో 400 కేవీ సబ్స్టేషన్, రూ.1,182.15 కోట్లతో 16 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ ద్వారా రూ. 105 కోట్లతో 628 ఆలయాల అభివృద్ధి, రూ.17.65 కోట్లతో 4044 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. 73 మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏ ర్పాటు చేయించారు. రూ.10 కోట్లతో ఫుట్పాత్ల నిర్మా ణం, రూ. 46 లక్షలతో 150 అడుగుల జాతీయ జెండాను ఏర్పా టు చేశారు. రూ.5.18 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి పట్టణాన్ని వి ద్యుత్ వెలుగులతో నింపారు.
2022-23 సంవత్సరానికి 60,809 మంది రైతులకు రూ.68.17 కోట్ల రైతుబంధు సాయం అందించారు. రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రూ.714 కోట్లతో ఏర్పాటు చేసిన లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతలతో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. రూ.396 కోట్లతో నిర్మల్ పట్టణ సమగ్రాభివృద్ధి పనులు, రూ.166 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం కొనసాగుతున్నది.
-రాంపెల్లి నరేందర్