నిర్మల్ అర్బన్, మే 31: సీఎం కేసీఆర్ ఈ నెల 4న నిర్మల్లో పర్యటిస్తారని, లక్ష మందితో బహిరంగ సభను నిర్వహిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. బుధవారం నిర్మల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సీఎం సభాస్థలి వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.
పట్టణ శివారులోని కొండాపూర్ వద్ద గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం, బహిరంగ సభ వద్ద ముఖ్యమంత్రి వేదిక, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.