హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 9.7 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 8న రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. రాష్ట్రంలోకి ఈశాన్య, తూర్పు దిశ ఉపరితల గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఈ చలిగాలుల వల్ల సంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. మరో 27 జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది.