హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ఇంటి వద్ద ఓటు వేసే అర్హత వయస్సును 80 ఏండ్ల నుంచి 85 ఏండ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. వచ్చే లోక్సభ ఎన్నికల నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు 85 సంవత్సరాలు, ఆ పైన వయస్సు ఉన్న వారే హోం ఓటింగ్ దరఖాస్తుకు అర్హులని సోమవారం సీఈవో వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.