రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ శనివారం ప్రారంభమైంది. చిన్నారుల్లో పోషకాహారలోపం నివారణ, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ సూచనతో స్థానిక రాజీవ్నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో చిరు ధాన్యాల పోషకాహార పండుగకు కలెక్టర్ అనురాగ్ జయంతి శ్రీకారం చుట్టారు.
జిల్లాలో 700 మంది పిల్లలు తీవ్ర పోషకాహారలోపం, మరో 200 మంది అతి తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీరికి సరైన పోషకాలు అందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
– సిరిసిల్ల రూరల్