Minister KTR | హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నది. రూ.16వేలకోట్లతో మరో మూడు డేటా కేంద్రాలను ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దావోస్లో ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ఈ విషయాన్ని ప్రకటించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి దావోస్లో వరుసగా పలు కంపెనీల సీఈవోలు, వ్యాపార దిగ్గజాలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ కేఫ్లో ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఆసియా అధ్యక్షుడు అహ్మద్ మజర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరో మూడు డేటా సెంటర్లను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
గతేడాది కంపెనీ మూడు డేటా కేంద్రాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో మొత్తం కేంద్రాల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఇందులో ఒక్కో డేటా సెంటర్ సగటున 100 మెగావాట్ల ఐటీ లోడ్ను అందిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దశలవారీగా ఆరు డేటా సెంట్లర్ల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ డేటా సెంటర్లు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అజూర్ కస్టమర్లకు సేవలందించేందుకు తన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తున్నది. వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో మొత్తం ఆరు డేటా సెంటర్లను దశలవారీగా ఏర్పాటు చేయనున్నది.
నైపుణ్యం, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, క్లౌడ్ అడాప్షన్ వంటి అనేక ప్రయోజనకరమైన కార్యకలాపాలను ప్రారంభించడానికి తెలంగాణ గతంలో మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ నిర్ణయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం భారీ పెట్టుబడులు మైక్రోసాఫ్ట్ తెలంగాణలో డేటా సెంటర్ల కోసం భారీగా పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధిని కొనసాగించాలని నేను ఎదురుచూస్తున్నాన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటని, నగరంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ ఏషియా ప్రెసిడెంట్ అహ్మద్ మజారీ తెలిపారు.
డేటా సెంటర్లతో పాటు ప్రత్యేక ప్రాజెక్టులను గుర్తించి వాటిని అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మైక్రోసాఫ్ట్ పనిచేస్తుందని మజారీ తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెబ్పీటీ సంస్థ పేర్కొంది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో వెబ్పీటీ సంస్థ ఒప్పందం కురింది. ఈ సంస్థ అమెరికాలోని ఫీనిక్స్ కేంద్రంగా పని చేస్తున్నది. రూ.150కోట్లతో హైదరాబాద్లో కొత్త సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. వైద్య సంస్థలకు ఔట్ పేషెంట్, రీహాబిలిటేషన్ థెరపీలో డిజిటల్ సేవలను సంస్థ అందిస్తున్నది.