Rain alert | హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఏడు రోజులు రాష్ట్రమంతా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్తో పాటు నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం, మహబూ బాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.