ఇంద్రవెల్లి, జనవరి 21 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబాకు ఫిబ్రవరి 9న అర్ధరాత్రి నిర్వహించే మహాపూజల కోసం హస్తలమడుగు నుంచి గంగాజలం తీసుకువచ్చేందుకు మెస్రం వంశీయులు బయలుదేరి వెళ్లారు. ఆదివారం సాయంత్రం కెస్లాపూర్లోని పురాతన నాగోబా ఆలయం (మురాడి)లో భద్రపర్చిన గంగాజల ఝరిని కటోడ కోసు, ధర్ము, హనుమంత్రావ్ బయటకు తీసి కటోడ కోసు వీపుపై తెల్లవస్త్రంతో కట్టారు. అనంతరం కటోడ కోసు, కటోడ కోసేరావ్, కటోడ హనుమంత్రావ్, పర్ధాంజీ దాదారావ్తోపాటు 150 మంది పాదయాత్రగా వెళ్లారు.