ఇంద్రవెల్లి, జనవరి 13: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణ కోసం మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. శనివారం రాత్రి కెస్లాపూర్కు చేరుకుని.. గ్రామంలోని పురాతన నాగోబా దేవస్థానం (మురాడి)లో సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం సమావేశం నిర్వహించి నాగోబాకు ఫిబ్రవరి 9న నిర్వహించే మహాపూజలతోపాటు గ్రామాల్లో వారం రోజులపాటు ప్రచారం నిర్వహించే ఎడ్లబండిపై చర్చించారు. సమావేశంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ పటేల్, పెద్దలు, వంశీయులు పాల్గొన్నారు.