హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ లెక్చరర్ల ఫోరం బుధవారం టీజీవోలో విలీనమైంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల కలను ప్రభుత్వం సాకారం చేసినందుకు సహకరించిన టీజీవోలో తమ ఫోరాన్ని విలీనం చేస్తున్నట్టు కన్వీనర్ సయ్యద్ జబీ వెల్లడించారు. తమను రెగ్యులరైజ్ చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.