హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఎన్నికైన ఐదుగురు శాసనమండలి సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, పరుపాటి వెంకట్రామిరెడ్డి, పాడి కౌశిక్రెడ్డి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ వీ భూపాల్రెడ్డి ప్రమాణం చేయించారు. అనంతరం సభ్యులను మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, శాసనసభా వ్యవహరాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు అభినందించారు. వీరితో పాటుగా వివిధ జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.