బెజ్జూర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ వాసి మేకల శ్రీనివాస్కు చెందిన ఆవు దూడ పులిదాడిలో మృత్యువాతపడింది. దూడ మంగళవారం ఉదయం అడవిలో మేతకు వెళ్లింది.
బుధవారం అడవిలో చూడగా ఆవు దూడ కళేబరం కనిపించింది. అటవీ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు.