హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న మంగోలియాలోని పశువులను కాపాడేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మంగోలియాలో విపరీ తమైన మంచు కురుస్తున్నది. దీంతో గొర్రెలు, ఆవులు మొదలైనవాటికి పశుగ్రాసం దొర క్క మృత్యువాత పడుతున్నాయి.
మంగోల్ ఆయిల్ రిఫైనరీ బృందం తమ దేశంలోని పశువులు, కాపరులను కాపాడేందుకు సాయం చేయాలని అక్కడ గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫై నరీ నిర్మిస్తున్న ఎంఈఐఎల్ను కోరింది. స్పందించిన ఎంఈఐఎల్ ట్రక్కులో పశుగ్రాసా న్ని, కాపరులు చలిని తట్టుకునేలా బ్లాంకెట్లు, ఉలెన్ జాకెట్లు, ఆహారం అందించింది.