మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూరు పట్టణంలో ఈనెల 20వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పెద్దవంగర మండలంలోని పలు తండాల్లో తండా బాట నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఈ విషయం తెలిపారు. ఈ మధ్యకాలంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారితో పాటు వివిధ అర్హతలు ఉన్న వాళ్లందరికీ ఈ జాబ్ మేళాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.