హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): న్యాయవాదుల కోసం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బుధవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు (ఈ నెల 29 వరకు) కొనసాగే ఈ కార్యక్రమంలో అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు ఈ హెల్త్ క్యాంప్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ నంద సహా అనేకమంది న్యాయవాదులు వైద్య పరీక్షలు చేయించుకొన్నారు. కార్యక్రమంలో హెచ్ సీఏఏ అధ్యక్షుడు వీ రఘునాథ్, ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.