పెద్దపల్లి : రామగుండం మండలం మల్యాలపల్లి శివారులోని ఎన్టీపీ కూలింగ్ టవర్ వెనుకాల దారుణ హత్య జరిగింది. ఎన్టీసీపీ కాజిపల్లికి చెందిన కాంపల్లి శంకర్(మీ సేవా ఆపరేటర్)ను గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా చంపేశారు. మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేశారు. తల, చేతులు లభ్యం కాగా, మొండెం ఆచూకీ లభించలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంకర్ భార్యే ఈ దారుణానికి పాల్పడిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శంకర్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని రామగుండం సీఐ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.