KCR | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. మొదట కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్ధుంపూర్లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా చెప్పారు.
అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో పర్యటించారు. గులాబీ దళపతికి రైతులు ఎండిపోయిన వరిపైరుని చూపిస్తూ గోడును మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అన్నదాతలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎన్నికల తర్వాత మేడిగడ్డకు 10వేల మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని.. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం శాభాష్పల్లి వద్ద మధ్య మానేరు జలాశయాన్ని పరిశీలించారు.