మహబూబాబాద్ : మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మహబూబాద్ పట్టణంలోని 551 సర్వే నెంబర్ లలోని 30 ఎకరాలలో చేపట్టిన మెడికల్ కళాశాల పనులను గురువారం సాయంత్రం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
మంత్రి వెంట ఎమ్మెల్యే శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అదనపు కలెక్టర్ కొమరయ్య, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి. ఆర్.అండ్.బి.ఈ ఈ తానేశ్వర్, ప్రభుత్వ దవాఖాన పర్యవేక్షకులు భూక్యా వెంకట రాములు, తహశీల్దార్ రంజిత్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.