ముషీరాబాద్, డిసెంబర్ 6: ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మేడి పాపయ్య మాదిగను తమ సంఘం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ వెల్లడించారు. విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు విలేకరులకు తెలిపారు. సంఘం పేరు చెప్పుకొని వ్యక్తిగత అవసరాలే ధ్యేయంగా పని చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఎమ్మార్పీఎస్ పేరు వాడుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు పసలాది యాదగిరి, వరిగడ్డి చందు, జన్నారం జీవన్, ధర్మారపు శ్రీకాంత్, కానుగంటి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.