హైదరాబాద్/ములుగు, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)/తాడ్వాయి/ములుగురూరల్: తెలంగాణ మహా కుంభమేళాకు తెరలేచింది. వన జాతర మేడారం జనంతో నిండుతున్నది. సమ్మక-సారలమ్మ జాతరలో కీలక ఘట్టం మొదలయ్యే తరుణం రానే వచ్చింది. కార్లు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఎడ్లబం డ్లు.. అన్ని మేడారం బాట పడుతున్నాయి. కొ న్ని గంటల్లో మొదలయ్యే మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా మేడారం చేరుకుంటున్నారు.
గద్దెపైకి చేరిన జంపన్న
సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి 8 గంటలకు వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడు. పూజారి పోలెబోయిన సత్యం కన్నెపల్లిలోని ఇంటిలో పూజా సామగ్రిని శుద్ధిచేసిన అనంతరం జంపన్న గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైన డాలు, కర్రకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గ్రామ మహిళలు ఊరు పొడవునా నీళ్లారబోస్తూ జంపన్నను సాగనంపారు.
నేడు గద్దెపైకి సారలమ్మ..
కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం మొదలుకానున్నది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు పూజలు నిర్వహిస్తారు. ఆదివా సీ పూజారులు, మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఏఎస్పీలు కలిసి కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారంలోని గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఈలోపే పూజారులు, అధికారులు కొండాయి నుంచి గోవిందరాజులును, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారం గద్దెల వద్దకు చేరుస్తారు. వరాల తల్లి సమ్మక గురువారం మేడారం గద్దెలపైకి రానున్నది. ఇద్దరు వన దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుం ది. శనివారం వన దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తుంది.
1.50 కోట్ల మంది వస్తారని అంచనా..
మేడారం మహా జాతరకు ఈసారి కోటిన్నర మంది వస్తారని అంచనా. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మేడారంలో తాతాలిక ఏర్పాట్లతోపాటు ఈ ఏడాది శాశ్వత ఏర్పాట్లపైనా దృష్టి సారించింది. ఈ జాతర కోసం రూ.110 కోట్లు ఖ ర్చు చేస్తున్నది. ఇప్పటికే 60 లక్షల మంది మేడారంలో మొకులు సమర్పించుకున్నారు.
6 కిలోమీటర్ల పొడవున స్నాన ఘట్టాలు
సమ్మక, సారలమ్మ గద్దెల వద్దకు వచ్చే అ న్ని వర్గాల భక్తులకు సులుభంగా దర్శనం చేసుకొనేలా ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనానికి ఐదు క్యూలైన్లు, వికలాంగులు, వీవీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వన దేవతలకు బెల్లం (బంగారం) సమర్పించే ప్రక్రియ ఉచితమే. పుణ్య స్నానాలు ఆచరించేందుకు జంపన్న వాగుకు ఇరువైపులా ఆరు కిలోమీటర్ల పొడవున స్నాన ఘట్టాలు నిర్మించారు.
300 ఎల్ఈడీ స్రీన్ల ఏర్పాటు
జాతర ప్రదేశాన్ని 450 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షిస్తున్నారు. భద్రత కో సం 12 వేల మంది పోలీసులను మోహరిం చారు. జాతరలో 300 ఎల్ఈడీ స్రీన్లను ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో 33 పారింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను 10 జోన్లు, 38 సెక్టార్లు, 60 సబ్ సెక్టర్లుగా విభజించి సెక్టార్ల వారీగా అధికారులు సిబ్బందిని నియమించా రు. సెక్టోరల్ అధికారులకు ఇచ్చిన వాకీటాకీ ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిషరిస్తున్నారు. దాదాపు 16 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా
ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా రూ.13.50 కోట్లతో పనులు చేపట్టారు. 17 ఇన్ ఫిల్టరేషన్ వెల్స్, 495 ప్రాంతాల్లో 5వేల ట్యాప్స్ ఏర్పాటుచేశారు. విద్యుత్తుకు అంతరాయం కలగకుండా 40 జనరేటర్లు ఏర్పాటు చేశారు. 210 ట్రాన్స్ఫార్మర్లను ప్రత్యేకంగా బిగించారు. ఏడు ఓవర్ హెడ్ ట్యాంకులతో తాగునీరు అందిస్తున్నారు. 8,400 తాతాలిక మరుగుదొడ్లు 500 ప్రాం తాల్లో ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల శుభ్రత కోసం 300 మంది సిబ్బందిని నియమించారు. 300 మినీ డంపింగ్ యా ర్డులు, గద్దెలు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంచేసేలా మూడు షిఫ్టులో పనిచేసేలా సిబ్బందిని నియమించారు.
100 పడకలతో దవాఖాన
వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. వన దేవతల గద్దెల పకనే ఉన్న వైద్య శాఖ భవనంలో 100 పడకల దవాఖానను ఏ ర్పాటు చేసింది. 108, 104 వాహనాలను సి ద్ధం చేసింది. 25 మంది వైద్యులు, 120 మం ది వైద్యాధికారులు, 857 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించారు. 75 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ జాతరలో ప్రత్యేకంగా 30 మొబైల్ అంబులెన్స్లను ఎర్పాటు చేశారు.
ఆన్లైన్లో బంగారం మొక్కులు
తపాలాశాఖ దేవాదాయశాఖ సమన్వయం తో బంగారం (బెల్లం) ప్రసాదంగా సరఫరా చేసేందుకు ఈ-పేమెంట్ వసతి కల్పించింది. దేశంలోని ఏ ప్రధాన పోస్టాఫీసు ద్వారానైనా ఆన్లైన్లో బంగారం మొక్కులు చెల్లించవ చ్చు. భక్తులు కేజీ బంగారం (బెల్లం)కి రూ.60 చొప్పున చెల్లించి ఈ సౌకర్యాన్ని పొందవచ్చని, సర్వీసు చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తపాలా శాఖ వెల్లడించింది.
మేడారం అభివృద్ధికి వంద ఎకరాలు
మేడారం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కమిటీని నియమించి వంద ఎకరాల భూ సేకరణ చేపట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం ఆమె మేడారంలో మీడియాతో మాట్లాడారు. చరిత్ర పరిశోధకులు సమ్మక్క- సారలమ్మ పూజారుల సహకారంతో తల్లుల వాస్తవ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా శిలా శాసనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతరకు గవర్నర్తోపాటు సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు దర్శనానికి రానున్నట్టు సీతక్క వెల్లడించారు.
మేడారం జాతరకు ఆరు వేల బస్సులు
మేడారం జాతరకు గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి 6000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. రెండేండ్ల్లకోసారి జరిగే మహాజాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగానే ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు 30 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.