వచ్చే నెల జరగబోయే మేడారం జాతరకు ట్రస్ట్ బోర్డు మెంబర్లతో దేవాదాయ శాఖ కమిషనర్ కమిటీని నియమించారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా కమిషనర్ జారీ చేశారు. ఈ కమిటీలో 14 మంది సభ్యులుగా ఉంటారు. కోర్నిబెల్లి శివయ్య, సప్పిడి వెంకట్రాంనర్సయ్య, చిలకమర్రి రాజెందర్, లకావత్ చందూలాల్, వట్టం నాగరాజు, బండి వీరాస్వామి, సనికొమ్ము ఆదిరెడ్డి, నక్క సాంబయ్య, సత్యనారాయణ, తండా రమేష్, పొడెం శోభన్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, సిద్దబోయిన జగ్గారావు మెంబర్లుగా ఉంటారు. వీళ్లతో ఈనెల 29న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.