వరంగల్, మార్చి 6: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర హుండీల లెక్కింపు బుధవారం ముగిసింది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో 540 హుండీలను లెక్కించగా.. రూ.13,25,22,511 ఆదాయం వచ్చింది. 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 55 కిలోల 150 గ్రాముల వెండి వస్తువులు వచ్చాయి.