హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికి గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా నిధులు కూడా ఎందుకు విడుదల చేయలేదని.. ఎంపీ బండి సంజయ్ని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ మొత్తం రూ. 332.71 కోట్లను విడుదల చేశారని కవిత గుర్తు చేశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేకసార్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని కవిత విమర్శించారు.
పని చేసే టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10% రిజర్వేషన్ల ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఆమోదించి వెంటనే రిజర్వేషన్లు కల్పించి, మేడారానికి జాతీయ హోదా తెచ్చి , ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపీ సంజయ్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ఈ మేరకు..మేడారం జాతరకు జాతీయ హోదా, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సత్యవతి రాథోడ్ రాసిన తాజా లేఖలను జతచేస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.