నర్సాపూర్, జూన్ 24: రూ.42 లక్షల విలువైన విదేశీ మద్యాన్ని ధ్వంసం చేసినట్టు మెదక్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నర్సాపూర్ ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో 21 కేసుల్లో సీజ్ చేసిన విదేశీ మద్యాన్ని డిప్యూటీ కమిషనర్ హరికిషన్ ఆదేశాల మేరకు నర్సాపూర్ డంపుయార్డులో ధ్వంసం చేసినట్టు తెలిపారు.
రూ.42 లక్షల విలువైన 783 బాటిళ్లు, 587 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏఈఎస్ ట్రైనీ సీఐ సతీశ్కుమార్, నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ గులాం ముస్తఫా, ఎస్ఐలు ఆంజనేయులు, అరుణ్ సిబ్బంది ఉన్నారు.