మెదక్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణను వేగవంతం చేశారు. మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామం శివారులోని 77, 78, 79, 80, 81, 82వ సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. నిన్న 130 సర్వే నెంబర్లోని 18.35 ఎకరాల్లో సర్వే పూర్తయింది.
జమున హ్యాచరీస్ పరిశ్రమ వెనకభాగంలో ఉన్న అచ్చంపేట శివారులోని సర్వే నంబర్ 130లోని 18.35 ఎకరాల భూమిని అధికారులు నిన్న సర్వే చేశారు. ఈ సర్వే నంబర్కు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న రైతులు 20 మందితోపాటు పరిశ్రమ ప్రతినిధుల సమక్షంలో అధికారులు సర్వే చేశారు. హద్దులను ఏర్పాటు చేయడంతోపాటు సబ్డివిజన్, రైతుల కబ్జా, వారికి ఉన్న పట్టా సర్టిఫికెట్ల ఆధారంగా ఈ సర్వే చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సంబంధిత భూముల్లో కబ్జా, రైతుల సర్టిఫికెట్లను పరిశ్రమ గేటు వద్ద పరిశీలించిన అనంతరం, పరిశ్రమలోకి అనుమతించారు.