మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 25: మెదక్ సీఎస్ఐ (చర్చి ఆఫ్ సౌత్ ఇండియా) కెథడ్రాల్ చర్చిలో సోమవారం క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరిగాయి. ఇందులో నిర్వహించిన మొదటి ఆరాధనకు మెదక్ డయాసిస్ అధ్యక్ష మండల బిషప్ రెవరెండ్ పద్మారావు పాల్గొన్నారు.
అనంతరం భక్తులకు ఆయన వాక్యోపదేశం చేస్తూ.. సీఎస్ఐ చర్చి నిర్మించి 99 ఏండ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగిడుతున్నదని, ఈ సందర్భంగా 2024 ఏడాదంతా శతాబ్ది వేడుకలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.